విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు
విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య. సన్మానించిన జర్నలిస్టులు, ఉపాధ్యాయులు
Editor Desk
యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర యాదయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తోటకూర యాదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.
సీనియర్ జర్నలిస్టులు కొడారి వెంకటేష్, పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ యాదయ్య సామాజిక, విద్యా రంగాల్లో మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తోటకూర కృష్ణ, తోటకూర సంతోష్, పాక మౌనిక, పింకి, భవ్య, స్వప్న, ప్రమీల, కనకలక్ష్మి, రషీద, మాధవి, సరిత, జోసెఫ్, షాబుద్దీన్, కృష్ణ, నవరతన్, సురేందర్, పాఠశాల సిబ్బంది రాజు, ఇంద్రయ్య, అయేషా తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి