విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య నియామకం శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, ఉపాధ్యాpయులు
విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా తోటకూర యాదయ్య నియామకం శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, ఉపాధ్యాpయులు
Editor Desk
భువనగిరి పట్టణానికి చెందిన శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర యాదయ్య యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం సీనియర్ జర్నలిస్టులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తోటకూర యాదయ్య మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
అనంతరం సీనియర్ జర్నలిస్టులు కొడారి వెంకటేష్, పాక జహంగీర్ యాదవ్లు తోటకూర యాదయ్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తోటకూర కృష్ణ, తోటకూర సంతోష్, పాక మౌనిక, పింకి, భవ్య, స్వప్న, ప్రమీల, కనకలక్ష్మి, రషీద, మాధవి, సరిత, జోసెఫ్, షాబుద్దీన్, నవరతన్, సురేందర్తో పాటు పాఠశాల సిబ్బంది రాజు, ఇంద్రయ్య, అయేషా తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి