PRINT TIME: May 26, 2026 03:38 PM
విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి
విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగుల మృతి
March 09, 2026 04:49 PM
34 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యర్రావారిపాలెం మండలం పరిధిలోని నెరబైలు సమీపంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి.
స్థానిక రైతులు పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విద్యుత్ షాక్కు గురైన రెండు ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన ఏనుగులపై పంచనామా నిర్వహించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి