PRINT TIME: April 11, 2026 03:41 AM
విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
January 29, 2026 01:26 AM
46 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా సీతారాంపురం గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో విద్యుత్ మౌలిక సదుపాయాలు కీలకమని,సబ్స్టేషన్ ఏర్పాటు ద్వారా రైతులు,ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి