Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 AM

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
March 10, 2026 09:21 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే,జ్యోతి రావు పూలే మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం పోరాడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వెనుకడుగు వేయని మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు.స్త్రీల విద్య, సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఆడపిల్లల చదువు కోసం ఎన్నో ఇబ్బందులు,దాడులు ఎదుర్కొంటూ కూడా తన భర్త జ్యోతి రావు పూలే ఆశయ సాధనలో అంకితభావంతో నడిచిన గొప్ప సహచరధర్మచారి అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాగేష్,ఎస్‌ఏఓ హరీష్ కుమార్,విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యదర్శి బొబ్బిలి మురళి,డివిజన్ అధ్యక్షులు రేసు శ్రీనివాస్,కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ సిద్ధి లింగం,డివిజన్ ప్రధాన కార్యదర్శి ర్యాకల బాల నరసింహ,డివిజన్ లీడర్ బత్తిని కిరణ్ కుమార్,విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News