విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
Sthanikam District Staff Reporter
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే,జ్యోతి రావు పూలే మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం పోరాడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వెనుకడుగు వేయని మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు.స్త్రీల విద్య, సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఆడపిల్లల చదువు కోసం ఎన్నో ఇబ్బందులు,దాడులు ఎదుర్కొంటూ కూడా తన భర్త జ్యోతి రావు పూలే ఆశయ సాధనలో అంకితభావంతో నడిచిన గొప్ప సహచరధర్మచారి అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాగేష్,ఎస్ఏఓ హరీష్ కుమార్,విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యదర్శి బొబ్బిలి మురళి,డివిజన్ అధ్యక్షులు రేసు శ్రీనివాస్,కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ సిద్ధి లింగం,డివిజన్ ప్రధాన కార్యదర్శి ర్యాకల బాల నరసింహ,డివిజన్ లీడర్ బత్తిని కిరణ్ కుమార్,విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి