Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
March 10, 2026 09:21 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే,జ్యోతి రావు పూలే మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం పోరాడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వెనుకడుగు వేయని మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు.స్త్రీల విద్య, సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఆడపిల్లల చదువు కోసం ఎన్నో ఇబ్బందులు,దాడులు ఎదుర్కొంటూ కూడా తన భర్త జ్యోతి రావు పూలే ఆశయ సాధనలో అంకితభావంతో నడిచిన గొప్ప సహచరధర్మచారి అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాగేష్,ఎస్‌ఏఓ హరీష్ కుమార్,విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యదర్శి బొబ్బిలి మురళి,డివిజన్ అధ్యక్షులు రేసు శ్రీనివాస్,కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ సిద్ధి లింగం,డివిజన్ ప్రధాన కార్యదర్శి ర్యాకల బాల నరసింహ,డివిజన్ లీడర్ బత్తిని కిరణ్ కుమార్,విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News