Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు క్రైస్తవ మత మార్పిడి తర్వాత SC స్థితి రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - అట్రాసిటీ చట్టం అర్హతపై కీలక వివరణ! టీబీతో జాగ్రత్త.. ఉమ్మడి నల్గొండలో భారీగా కేసులు “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 24, 2026 11:13 PM

విద్యుత్ బస్సులు ఆర్టీసీకే: సిఐటియు ధర్నాతో బలోపేత పోరాటం!

విద్యుత్ బస్సులు ఆర్టీసీకే: సిఐటియు ధర్నాతో బలోపేత పోరాటం!

విద్యుత్ బస్సులు ఆర్టీసీకే: సిఐటియు ధర్నాతో బలోపేత పోరాటం!
March 24, 2026 09:22 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

విద్యుత్బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పజెప్పి సంస్థను బలోపేతం చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్ నుంచి ప్రదర్శనగా ఏర్పడి, నల్లగొండ ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ పోరాటం ద్వారా ఆర్టీసీ పరిరక్షణకు ఐక్యతచాటుకున్నారు.

సిఐటియు ప్రధాన డిమాండ్లు: సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం ప్రసంగంలో, కేంద్ర MV యాక్ట్-2019, విద్యుత్ బస్ విధానాలు ఆర్టీసీలను క్షీణింపజేస్తున్నాయని విమర్శించారు. GCC పద్ధతితో ప్రైవేటు కార్పొరేట్లకు సబ్సిడీలు ఇస్తూ, ఆర్టీసీలు కనుమరుగు పడేపరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్లను ఆర్టీసీకే ఇచ్చి, ఆదాయ-ఖర్చు వ్యత్యాసాన్ని (వయబిలిటీ గ్యాప్ ఫండ్) ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. GCCని రద్దు చేసి, ప్రైవేటు సబ్సిడీలను ఆర్టీసీలకు మళ్లించాలని, ఆర్టీసీలు నేరుగా బస్సులు సమకూర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

బస్ఫ్యాబ్రికేషన్‌ను ఆర్టీసీ వర్క్‌షాప్‌లలో చేయించాలని, PM ఈ-డ్రైవ్ పథకంలో రెట్రో-ఫిట్‌మెంట్ బస్సులకు సబ్సిడీ వర్తింపజేయాలని, బస్సుల సంఖ్యను పెంచాలని, కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లు లేవనెత్తారు. ఈనెల 25న MVN విజ్ఞాన కేంద్ర లైబ్రరీ హాల్‌లో ఉద్యోగులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత ఆర్టీసీ పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు: ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి అవుట రవీందర్, SWF రీజన్ అధ్యక్షులు కందుల నరసింహ, సహాయ కార్యదర్శి కే.శ్యాంసుందర్, డిపో కార్యదర్శి ఎస్‌కే గులాం రసూల్, అధ్యక్షులు ఏం.నరసింహయ్య, జిల్లా కమిటీ సభ్యులు చింతకాయల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు బ్యానర్లు, స్లోగన్‌లతో నిరసన వ్యక్తం చేసి, పోరాట తీర్మానం ప్రకటించారు.

ఈ ధర్నా తెలంగాణ ఆర్టీసీల పరిరక్షణకు కొత్త ఊపిరి పోసింది. ప్రజా రవాణాసేవలను కార్పొరేట్ చేతుల్లోకి ఇవ్వకుండా కాపాడాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఆలోచింపజేస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News