Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:33 PM

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు
April 06, 2026 07:28 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏడో తేదీ చలో వరంగల్ – ఎనిమిదో తేదీ నుండి సమ్మె ప్రారంభం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమ్మె పోస్టర్‌ను ట్రాన్స్కో సూర్యాపేట వలయాధ్యక్షుడు బోనాల శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ నాయకులు బండి నరేష్, రవి, సుధాకర్, రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోనాల శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులకు అర్హతలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంయుక్త చర్య సమితి పిలుపు మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ సంయుక్త చర్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తేదీన వరంగల్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఆర్టిజన్ కార్మికులు వరంగల్‌లోని ఉత్తర విద్యుత్ పంపిణీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే ఎనిమిదో తేదీ ఉదయం 9 గంటల నుండి దాదాపు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News