విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ సూచించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత ఎంసెట్, నీట్ కోచింగ్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలబెట్టడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.విద్యార్థులు తమ పూర్తి బయోడేటాతో 96344 43338 నంబర్కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
PRINT TIME: August 25, 2026 08:13 AM
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఇ ఎల్ వి భాస్కర్
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఇ ఎల్ వి భాస్కర్
18-03-2026
111 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ సూచించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత ఎంసెట్, నీట్ కోచింగ్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలబెట్టడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.విద్యార్థులు తమ పూర్తి బయోడేటాతో 96344 43338 నంబర్కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి