విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు
విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: చంద్రశేఖర్ రెడ్డి పిలుపు
Krishna
భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మానసికంగా,శారీరకంగా దృఢమైన యువత అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే “నశాముక్త్ భారత్” సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు నారాయణఖేడ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రభావం నుంచి విద్యార్థులు దూరంగా ఉండి, సోషల్ మీడియా దుర్వినియోగానికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణరావు, చంద్రశేఖర్ ఆచార్య, ధన్సింగ్, హమీద్ మరియు బ్రహ్మకుమారి సమాజం సభ్యులు లక్ష్మీదీది, రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి