Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:16 AM

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి.  సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం
12-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం కోసం కరాటే నేర్చుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్‌సింగ్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచడమే కాకుండా స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణలు అందించడం అభినందనీయమన్నారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ రాచకొండ రాజు, నాయకులు తాళ్లపల్లి జితేందర్‌, గంటెపాక శివకుమార్‌, తొలుపునూరి చంద్రశేఖర్‌, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, ఆకుల ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

Article Image

రామన్నపేట: విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం కోసం కరాటే నేర్చుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్‌సింగ్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచడమే కాకుండా స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణలు అందించడం అభినందనీయమన్నారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ రాచకొండ రాజు, నాయకులు తాళ్లపల్లి జితేందర్‌, గంటెపాక శివకుమార్‌, తొలుపునూరి చంద్రశేఖర్‌, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, ఆకుల ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News