విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
Editor Desk
రామన్నపేట: విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం కోసం కరాటే నేర్చుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచడమే కాకుండా స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణలు అందించడం అభినందనీయమన్నారు.
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ రాచకొండ రాజు, నాయకులు తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శివకుమార్, తొలుపునూరి చంద్రశేఖర్, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, ఆకుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి