Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:09 PM

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి.  సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం
May 12, 2026 03:52 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం కోసం కరాటే నేర్చుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్‌సింగ్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచడమే కాకుండా స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణలు అందించడం అభినందనీయమన్నారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ రాచకొండ రాజు, నాయకులు తాళ్లపల్లి జితేందర్‌, గంటెపాక శివకుమార్‌, తొలుపునూరి చంద్రశేఖర్‌, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, ఆకుల ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News