Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:49 PM

విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలి –జిల్లా యంత్రాంగం సూచన

విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలి –జిల్లా యంత్రాంగం సూచన

విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలి –జిల్లా యంత్రాంగం సూచన
February 24, 2026 04:52 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 54 కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన సిబ్బందిని నియమించారు.మొత్తం 35,986 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. పదవ తరగతి పరీక్షలకు 123 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 24,657 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, నిషేధాజ్ఞలు అమలు చేయడం, జిరాక్స్ సెంటర్ల తాత్కాలిక మూసివేత వంటి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సదుపాయాలు కల్పించారు.విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని, సెల్‌ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, డీఈవో వెంకటేశ్వర్లు, డిఐఈఓ గోవింద్ రామ్, డిటిఓ కవిత, జడ్పీ సీఈవో, డిపిఓ జానకి రెడ్డి, డిఎంఎల్‌హెచ్‌ఓ వసంత్ రావు, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News