Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:06 PM

విద్యార్థుల్లో యోగ, పోటీ పరీక్షలపై చైతన్యం

విద్యార్థుల్లో యోగ, పోటీ పరీక్షలపై చైతన్యం

విద్యార్థుల్లో యోగ, పోటీ పరీక్షలపై చైతన్యం
May 12, 2026 08:56 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగ ప్రాముఖ్యతతో పాటు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం మాట్లాడుతూ.. యోగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగాను జీవన విధానంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు.

డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై అధ్యాపకులు డాక్టర్‌ జె. చిన్నబాబు, డాక్టర్‌ జి. సునీత విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమ ఇన్‌చార్జి, వ్యాయామ అధ్యాపకులు డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు యోగాసనాలపై ప్రదర్శన నిర్వహించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ సభ్యులు ఎం. అనిత, టి. శ్రీనివాస్‌, పరిపాలనాధికారి జి. కరుణాకర్‌, అధ్యాపకులు డాక్టర్‌ రత్నమంజుల, డాక్టర్‌ లక్ష్మీనీలిమ, డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్‌ సీహెచ్‌. వెంకట్‌గౌడ్‌, డాక్టర్‌ డి. కిషన్‌, డాక్టర్‌ రాచమళ్ళ శ్రీను, ఎస్‌. బాలరాజు, జె. నరేశ్‌, ఎ. ఆంజనేయులు, రాధికతో పాటు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News