విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా
విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా
Komidala Mahender reddy
విద్యార్థుల విహార యాత్రకు ఆర్థిక సహకారం అందించిన నర్రా వేణు మోహన్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ యాత్రకు సంబంధించి ప్రముఖ సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.విద్యార్థుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేసిన వేణు మోహన్ రెడ్డిని గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. బాహ్య ప్రపంచం ద్వారా వచ్చే లోకజ్ఞానం విద్యార్థుల మేధోవికాసానికి అవసరమని హెడ్మాస్టర్ జానకి పేర్కొన్నారు. సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు సంతోషంగా యాత్రకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి