Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఆసరా
March 15, 2026 02:47 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల విహార యాత్రకు ఆర్థిక సహకారం అందించిన నర్రా వేణు మోహన్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ యాత్రకు సంబంధించి ప్రముఖ సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.విద్యార్థుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేసిన వేణు మోహన్ రెడ్డిని గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. బాహ్య ప్రపంచం ద్వారా వచ్చే లోకజ్ఞానం విద్యార్థుల మేధోవికాసానికి అవసరమని హెడ్‌మాస్టర్ జానకి పేర్కొన్నారు. సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు సంతోషంగా యాత్రకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News