Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:56 PM

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ

విద్యార్థుల భోజనానికి శాశ్వత వసతి – డైనింగ్ హాళ్లకు భూమిపూజ
February 22, 2026 06:15 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పాఠశాలల్లో సౌకర్యాల విస్తరణకు శ్రీకారం

విద్యార్థుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం

మధ్యాహ్న భోజనానికి ఇక ఇబ్బందులు లేవు

2,604 చదరపు అడుగుల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం ప్రారంభం

అధినేత వనమాకేశ్వరరావు–సత్యవతి దంపతుల కుమారులు వనమా నవీన్, వనమా సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమార్థం మరో శుభకార్యం ప్రారంభమైంది.

డైనింగ్ హాళ్ల నిర్మాణానికి భూమిపూజ జరగడంతో చనుబండ, వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆనందం వ్యక్తమైంది. మధ్యాహ్న భోజన

సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

మొత్తం 2,604 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న హాళ్లు పూర్తయిన తర్వాత వందలాది విద్యార్థులకు ఒకేసారి సౌకర్యవంతంగా భోజనం చేసే అవకాశం కలుగనుంది. పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలను గ్రామస్తులు అభినందించారు.

విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్య మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది కావాలని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.






మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News