విద్యార్థి దశలో సరైన నిర్ణయాలే విజయానికి పునాది: చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
విద్యార్థి దశలో సరైన నిర్ణయాలే విజయానికి పునాది: చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
K.RAVI
తంగడపల్లి జడ్పీ పాఠశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు
విద్యార్థి దశలో తీసుకునే సరైన నిర్ణయాలు, ప్రణాళికాబద్ధమైన కృషి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని చౌటుప్పల్ పుర చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. పుర పరిధిలోని తంగడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు – ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.
పాఠశాలప్రధానోపాధ్యాయురాలు ధీరావత్ భార్గవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటే గురువులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంస్కారం కలిగి ఉండాలని సూచించారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిపిలుపునిచ్చారు.అనంతరం పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మనస్విని, మాధురి, శైలి, పునిత్, సహానా, స్నేహ, హన్సికలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, గడ్డం ఇందిర రాజారత్నం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఉదరి పద్మ, ఉపాధ్యాయులు ఎం.వి. చారి, వెంకటేశ్వరరావు, అంతటి వెంకటేశం, సరళ, నీరజ, లింగయ్య, ప్రతిమ, మంగమ్మ, మహేశ్వరి, రమాదేవి, యాదయ్య, శ్వేత, పద్మావతి, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి