విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి
Sthanikam District Staff Reporter
పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలనీ పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు సురుపంగ శివలింగం,దొడ్డి యాదగిరి,సిలువేరు జైపాల్,భానోతు భాస్కర్ నాయక్ లు అన్నారు. శనివారం రోజు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగ గత నవంబర్ ఇరవై ఆరవ తేదీన నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. మాత రమాభాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ తీగుళ్ళ జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశ పౌరులందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనీ,ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల యొక్క విశిష్టతను తెలుసుకోవాలని రాజ్యాంగంలోని ప్రతీ ఆర్టికల్ దేశాన్ని అన్ని రంగాలలో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను బలోపేతం చేస్తుందని అన్నారు. రాజ్యాంగానికి ప్రాధమిక హక్కులు ప్రజాస్వామ్యానికి ప్రాణం అయితే ఆదేశిక సూత్రాలు సామాజిక న్యాయయానికి మార్గమని,ప్రాధమిక హక్కులు వ్యక్తిని కాపాడితే,ఆదేశిక సూత్రాలు సమాజాన్ని మారుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్ధినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా నిర్వాహకులు పన్నెండు పంది విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.మాత రమాభాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు సమర్పించిన అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయనిలు జి స్వాతి,ఎం.స్వాతి. రిజ్వానా,వెన్నెల,మౌనిక,మమత,ఉషా,జ్యోతి,మాధవి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి