Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:42 AM

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి
February 07, 2026 07:26 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలనీ పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు సురుపంగ శివలింగం,దొడ్డి యాదగిరి,సిలువేరు జైపాల్,భానోతు భాస్కర్ నాయక్ లు అన్నారు. శనివారం రోజు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగ గత నవంబర్ ఇరవై ఆరవ తేదీన నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. మాత రమాభాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ తీగుళ్ళ జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశ పౌరులందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనీ,ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల యొక్క విశిష్టతను తెలుసుకోవాలని రాజ్యాంగంలోని ప్రతీ ఆర్టికల్ దేశాన్ని అన్ని రంగాలలో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను బలోపేతం చేస్తుందని అన్నారు. రాజ్యాంగానికి ప్రాధమిక హక్కులు ప్రజాస్వామ్యానికి ప్రాణం అయితే ఆదేశిక సూత్రాలు సామాజిక న్యాయయానికి మార్గమని,ప్రాధమిక హక్కులు వ్యక్తిని కాపాడితే,ఆదేశిక సూత్రాలు సమాజాన్ని మారుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్ధినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా నిర్వాహకులు పన్నెండు పంది విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.మాత రమాభాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు సమర్పించిన అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయనిలు జి స్వాతి,ఎం.స్వాతి. రిజ్వానా,వెన్నెల,మౌనిక,మమత,ఉషా,జ్యోతి,మాధవి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News