Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:57 PM

విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం

విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం

విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం
January 21, 2026 06:15 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం (టి.ఎస్.ఎస్.టి.ఎఫ్) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో మనూర్ మండల స్థాయి ప్రతిభా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మనూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్షను రాశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి రాజశేఖర్ షేట్కార్ మాట్లాడుతూ...విద్యే జీవితానికి పునాది అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతో పాటు మంచి విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు జి. వైద్యనాథ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల ఇన్చార్జిలు జ్యోతిర్లింగం రవీందర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, మచ్చేందర్, మధుకర్ రెడ్డి, స్వప్న, గోవర్ధన్ తదితరులు చురుకుగా పాల్గొన్నారు.ఈ ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News