Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:29 AM

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన
02-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో తీవ్ర నాణ్యత లోపం ఉందని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు భోజన గిన్నెలతోనే రాష్ట్ర రహదారి నార్కెట్‌పల్లి– అద్దంకి మార్గాన్ని అడ్డగించి నిరసన తెలిపారు.

విద్యార్థులు మాట్లాడుతూ, హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో అంబర్ (ప్లాస్టిక్) ప్యాకెట్లు లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. భోజన నాణ్యతను మెరుగుపరుస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.


Sthanikam

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన

Article Image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో తీవ్ర నాణ్యత లోపం ఉందని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు భోజన గిన్నెలతోనే రాష్ట్ర రహదారి నార్కెట్‌పల్లి– అద్దంకి మార్గాన్ని అడ్డగించి నిరసన తెలిపారు.

విద్యార్థులు మాట్లాడుతూ, హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో అంబర్ (ప్లాస్టిక్) ప్యాకెట్లు లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. భోజన నాణ్యతను మెరుగుపరుస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News