విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన
Komidala Mahender reddy
మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో తీవ్ర నాణ్యత లోపం ఉందని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు భోజన గిన్నెలతోనే రాష్ట్ర రహదారి నార్కెట్పల్లి– అద్దంకి మార్గాన్ని అడ్డగించి నిరసన తెలిపారు.
విద్యార్థులు మాట్లాడుతూ, హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో అంబర్ (ప్లాస్టిక్) ప్యాకెట్లు లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. భోజన నాణ్యతను మెరుగుపరుస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి