విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వెంటనే బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కౌ న్సిల్(ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి.) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.వారు ఆసుపత్రిలో వైద్యులను కలసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులందరికి స్పష్టంగా సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,వారి హక్కుల పరిరక్షణకు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు శ్రద్ధ చూపుతూనే ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యా అధికారులు,ఆసుపత్రి వైద్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి