Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ
January 29, 2026 11:53 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వెంటనే బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కౌ న్సిల్(ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి.) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.వారు ఆసుపత్రిలో వైద్యులను కలసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులందరికి స్పష్టంగా సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,వారి హక్కుల పరిరక్షణకు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు శ్రద్ధ చూపుతూనే ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యా అధికారులు,ఆసుపత్రి వైద్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News