Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ
January 29, 2026 11:53 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వెంటనే బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కౌ న్సిల్(ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి.) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.వారు ఆసుపత్రిలో వైద్యులను కలసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులందరికి స్పష్టంగా సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,వారి హక్కుల పరిరక్షణకు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు శ్రద్ధ చూపుతూనే ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యా అధికారులు,ఆసుపత్రి వైద్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News