Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:27 PM

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ
January 29, 2026 11:53 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వెంటనే బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కౌ న్సిల్(ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి.) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.వారు ఆసుపత్రిలో వైద్యులను కలసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులందరికి స్పష్టంగా సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,వారి హక్కుల పరిరక్షణకు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు శ్రద్ధ చూపుతూనే ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యా అధికారులు,ఆసుపత్రి వైద్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News