Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ
February 08, 2026 05:10 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

మానసిక ఒత్తిడి లేకుండా పదవతరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని, విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన వ్యక్తి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రకాష్, తిగుళ్ల శ్రీనివాస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.స్థానిక అరవిందో జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం అరవింద జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ ఆవిష్కరించి అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో సమస్యలే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక తీయడంకోసం నిరంతరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, త్వరలో రాబోయే పదవతరగతి పరీక్షలను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాసి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రుల కళల్ని నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులు ముందుగా భయాన్ని విడిచిపెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. చదివే అన్నింటికీ మూలమని ఉన్నతంగా చదివి జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అన్నారు.ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, ఎస్ఎఫ్ఐ నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో 300 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరై పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు, మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్, మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఈరిగి వరుణ్,. నాయకులు మల్లేష్ నవదీప్, సృజన, చంద్రిక, ప్రసన్న, అనూష, మనీషా, శిరీష, కీర్తన, అనూష, ఝాన్సీ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News