Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ

విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్.ఎస్ఎఫ్ఐ
February 08, 2026 05:10 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

మానసిక ఒత్తిడి లేకుండా పదవతరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని, విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన వ్యక్తి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రకాష్, తిగుళ్ల శ్రీనివాస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.స్థానిక అరవిందో జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం అరవింద జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ ఆవిష్కరించి అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో సమస్యలే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక తీయడంకోసం నిరంతరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, త్వరలో రాబోయే పదవతరగతి పరీక్షలను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాసి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రుల కళల్ని నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులు ముందుగా భయాన్ని విడిచిపెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. చదివే అన్నింటికీ మూలమని ఉన్నతంగా చదివి జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అన్నారు.ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, ఎస్ఎఫ్ఐ నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో 300 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరై పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు, మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్, మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఈరిగి వరుణ్,. నాయకులు మల్లేష్ నవదీప్, సృజన, చంద్రిక, ప్రసన్న, అనూష, మనీషా, శిరీష, కీర్తన, అనూష, ఝాన్సీ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News