Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:41 AM

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు
January 19, 2026 05:53 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ షబానా నాజ్ మాలి, ఉపసర్పంచ్ మైబు పటేల్ గ్రామంలోని వివిధ వార్డు సభ్యులతో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే పాఠశాల ఆవరణలో శుభ్రత అత్యంత అవసరమని వారు తెలిపారు.అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్మికులు ఎప్పటికప్పుడు విధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News