నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఈ రోజు స్కౌట్–గైడ్ శాలువాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య,
నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.అనంతరం అతిథులు విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినులతో మమేకమై వారి విద్యాభివృద్ధి, క్రమశిక్షణ,సేవాభావం గురించి ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు విద్యార్థినులు,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి