“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”
“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”
Krishna
చదువే ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి బాలుడు తప్పనిసరిగా విద్యను పొందాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ అన్నారు.శనివారం వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ స్కూల్లో విద్యార్థుల హక్కులపై అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, విద్య ప్రతి బాలుడి మౌలిక హక్కు అని, విద్య ద్వారానే పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు. చదువు వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు.బాలలపై ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం,భద్రత,పోషణ వంటి హక్కులను కల్పించాల్సిన బాధ్యత సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని వారు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గైనికాడి సురేష్ గౌడ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి