Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”
February 01, 2026 03:06 AM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

చదువే ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి బాలుడు తప్పనిసరిగా విద్యను పొందాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ అన్నారు.శనివారం వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ స్కూల్‌లో విద్యార్థుల హక్కులపై అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, విద్య ప్రతి బాలుడి మౌలిక హక్కు అని, విద్య ద్వారానే పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు. చదువు వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు.బాలలపై ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం,భద్రత,పోషణ వంటి హక్కులను కల్పించాల్సిన బాధ్యత సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని వారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గైనికాడి సురేష్ గౌడ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News