Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:23 PM

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”
February 01, 2026 03:06 AM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

చదువే ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి బాలుడు తప్పనిసరిగా విద్యను పొందాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ అన్నారు.శనివారం వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ స్కూల్‌లో విద్యార్థుల హక్కులపై అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, విద్య ప్రతి బాలుడి మౌలిక హక్కు అని, విద్య ద్వారానే పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు. చదువు వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు.బాలలపై ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం,భద్రత,పోషణ వంటి హక్కులను కల్పించాల్సిన బాధ్యత సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని వారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గైనికాడి సురేష్ గౌడ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News