విద్యా వారోత్సవాలు ముగింపు. స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్కు సన్మానం
విద్యా వారోత్సవాలు ముగింపు. స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్కు సన్మానం
Editor Desk
రామన్నపేట,
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు పత్రికా విలేకరులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్కు చిరు సన్మానం చేసి షీల్డ్ తో సత్కరించారు .
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. తాము చదివిన విద్యాసంస్థను మరచిపోకుండా ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికా మిత్రుల సహకారం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డా. జి. సునీత, డా. రాచమళ్ల శ్రీను, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డా. ఎం. రవీందర్ రావు, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, డాక్టర్ డి. కిషన్, కార్యాలయ సిబ్బంది ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి