విద్యా వారోత్సవాలు ముగింపు. రిపోర్టర్లకు సన్మానం
విద్యా వారోత్సవాలు ముగింపు. రిపోర్టర్లకు సన్మానం
Editor Desk
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు సమాజంలో బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్న పాత్రికేయులను కళాశాల యాజమాన్యం సన్మానించింది.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ గత వారం రోజులుగా విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ రంగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి కళాశాలకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. కళాశాలలో జరిగే కార్యక్రమాలను వార్తల ద్వారా సమాజానికి చేరవేస్తూ కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న పత్రికా విలేకరుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్, నవతెలంగాణ రిపోర్టర్ బూరుగు వెంకటేశం, తెలంగాణ గళం రిపోర్టర్ కె.వి. సుధాకర్ రాజు, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్,మన ప్రగతి రిపోర్టర్ కైరం కొండ సంతోష్ కుమార్లను కళాశాల అధ్యాపకులు శాలువాలు కప్పి, షీల్డ్లతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఐక్యూఎసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, సభ్యులు డాక్టర్ రత్న మంజుల, రాధిక, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీను, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, కార్యాలయ సిబ్బంది శ్రీదేవి, నాగరాజు, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి