Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:14 PM

విద్య, వైద్యంపై భారీ కేటాయింపులు పెంచాలి: సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

విద్య, వైద్యంపై భారీ కేటాయింపులు పెంచాలి: సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్

విద్య, వైద్యంపై భారీ కేటాయింపులు పెంచాలి: సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ డిమాండ్
February 18, 2026 11:39 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వచ్చే వార్షిక బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం గణనీయంగా కేటాయింపులు పెంచాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం విద్యకు కేటాయిస్తున్న 8 శాతం నిధులను కనీసం 15 శాతానికి పెంచాలని, వైద్య రంగానికి 4 శాతం నుండి 20 శాతం వరకు పెంపు చేయాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతమే కీలకం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేయడం అత్యవసరమని డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడితే సాధారణ వ్యాధులకే పెద్ద ఆసుపత్రులపై భారం తగ్గుతుందని అన్నారు.

డయాలిసిస్ కేంద్రాల విస్తరణకు పిలుపు కిడ్నీ సంబంధిత రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ కేంద్రాల సంఖ్య పెంచాలని ఆయన కోరారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు కల్పిస్తే పేదలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల ఆధునీకరణకు ప్రాధాన్యంవిద్య అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన పద్ధతులు అందుబాటులోకి తేవడం ద్వారా తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ప్రత్యేక దృష్టి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని డాక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News