Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:52 PM

విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్

విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్

విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్
January 31, 2026 10:56 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: డి.డి. దాస్ సీనియర్ జర్నలిస్ట్

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజియూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ "మహాత్మా గాంధీ గారి మహత్తర జీవితం మరియు ఆదర్శాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. సత్యం, అహింస, నైతిక విలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీజీ". "గాంధీ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు — ఆయన ఒక జీవన విధానం. స్వీయ క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి కూడా మార్గదర్శకం. విద్య అనేది కేవలం జ్ఞానం పొందడం మాత్రమే కాదు, మంచి మనిషిగా మారడమే అన్న ఆయన సందేశం విశ్వవిద్యాలయాల వంటి విద్యా సంస్థలకు అత్యంత ప్రాసంగికమైనది"."నేటి కాలంలో పెరుగుతున్న అసహనం, హింస, స్వార్థం మధ్య గాంధీ గారి ఆలోచనలు మరింత అవసరంగా మారాయి. మన ఆలోచనల్లో, మాటల్లో, కార్యాచరణలో సత్యం మరియు అహింసను పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది".

ఈ సందర్భంగా, విద్యార్థులంతా గాంధీ గారి ఆదర్శాలను తమ జీవితాల్లో అమలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. అధ్యాపకులు మరియు సిబ్బంది కూడా ఆయన బోధనల నుంచి ప్రేరణ పొందుతూ విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటున్నాను.మహాత్మా గాంధీ గారి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడిచే శక్తి మనందరికీ కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి,ఇన్ఫాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, యుసిసిబిఎం ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ శేఖర్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News