ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.
ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.
Editor Desk
ఇంద్రపాలనగరం: గ్రామంలోని శంకర్ గుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలకు సరైన వేతనాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓ ఆర్ యస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనులకు వచ్చే వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలుచటి కాటన్ దుస్తులు ధరించి రావాలని అవగాహన కల్పించారు.
అలాగే కూలీలకు తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, బోనగిరి సంజీవ్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి