Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు  ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.
23-05-2026 273 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శంకర్ గుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలకు సరైన వేతనాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓ ఆర్ యస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనులకు వచ్చే వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలుచటి కాటన్ దుస్తులు ధరించి రావాలని అవగాహన కల్పించారు.

అలాగే కూలీలకు తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, బోనగిరి సంజీవ్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శంకర్ గుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలకు సరైన వేతనాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓ ఆర్ యస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనులకు వచ్చే వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలుచటి కాటన్ దుస్తులు ధరించి రావాలని అవగాహన కల్పించారు.

అలాగే కూలీలకు తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, బోనగిరి సంజీవ్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News