Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:47 AM

ఈ-స్కూటర్‌ పై కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్

ఈ-స్కూటర్‌ పై కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్

ఈ-స్కూటర్‌ పై కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్
May 18, 2026 12:25 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఇంధన పొదుపులో భాగంగా సోమవారం పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి ఎలక్ట్రిక్ వాహనంలో కలెక్టరేట్ వచ్చి హాజరైన కలెక్టర్...ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చర్యలు చేపట్టారు.డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే సందేశంతో ఆయన 'నో వెహికల్ డే' (No Vehicle Day) పాటించారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి, ఎలక్ట్రిక్ వాహనాలను లేదా ప్రజా రవాణాను వినియోగించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా ఈ-స్కూటర్‌పై రావడంపై కలెక్టరేట్ సిబ్బంది, ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News