PRINT TIME: April 10, 2026 02:20 AM
దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
దుమ్ముగూడెం, జయపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
February 17, 2026 06:25 PM
47 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, తుమ్మగూడెం, జయపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రైతులతో మొక్కాజోన్నలో తీసుకోవలిసిన సస్య రక్షణ చర్యలను, ఎరువులు యాజమాన్య పద్ధతులను వివరించడం జరిగింది. ప్రతి రైతు ఈ పంట నందు వారి పంటను నమోదు చేసుకోవలని, ఏపీఎఫ్ఆర్ నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆర్ఎస్ కె వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఉబరిజషన్ పథకం ద్వారా డ్రోన్ సేవలను ఉపయోగిచుకోవాలని తెలియజేయడం జరిగింది. రైతులు తమ పొలంలో కొంత విస్తీర్ణం వరకు అయిన ప్రకృతి వ్యవసాయం సాగును అవలంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి