Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
108 ఉద్యోగుల చేయూతతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 07:48 PM

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”

దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”
March 31, 2026 05:02 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మాజీ మంత్రులపై విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు

నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

అసెంబ్లీలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.“రాఘవ పేరుతో మైనింగ్ లీజు ఉందని చెబుతున్నట్లయితే, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి” అని వీరేశం సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని అన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భూమి, ఇసుక, బొగ్గు వంటి సహజ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు దోపిడీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేయాలని ప్రయత్నించడందురుద్దేశపూరితమని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News