దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”
దోపిడీ దారులే దోపిడీ అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం”
Komidala Mahender reddy
మాజీ మంత్రులపై విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు
నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
అసెంబ్లీలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఖండించారు. పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.“రాఘవ పేరుతో మైనింగ్ లీజు ఉందని చెబుతున్నట్లయితే, దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలి” అని వీరేశం సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధమని అన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూమి, ఇసుక, బొగ్గు వంటి సహజ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు దోపిడీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గత పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలు మరచిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేయాలని ప్రయత్నించడందురుద్దేశపూరితమని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసే మాజీ మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వేముల వీరేశం డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి