Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:07 PM

దొంగతనాల కేసుల్లో పోలీసుల విజయం.. ₹15.5 లక్షల ఆస్తి స్వాధీనం

దొంగతనాల కేసుల్లో పోలీసుల విజయం.. ₹15.5 లక్షల ఆస్తి స్వాధీనం

దొంగతనాల కేసుల్లో పోలీసుల విజయం.. ₹15.5 లక్షల ఆస్తి స్వాధీనం
March 10, 2026 03:21 AM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల చాకచక్యంతో వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి భారీగా దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ S. సతీష్ కుమార్ఆ దేశాల మేరకు, పెనుకొండ డీఎస్పీ U. నరసింగప్ప మరియు సీఐ K. రాఘవన్ప ర్యవేక్షణలో రొద్దం, పెనుకొండ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

రొద్దంలో ఇద్దరు అరెస్ట్

ఈ నెల 8న రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలోని ఓల్డ్ జెడ్‌పీ హైస్కూల్ వద్ద ఎస్‌ఐ వీరాంజనేయులు నేతృత్వంలోని పోలీసులు ఉల్లెడ మల్లేష్ (41), టి. నవీన్ కుమార్ (36)లను అరెస్ట్ చేశారు. వీరు కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి శేషాపురం గ్రామంలోని ఆలయ హుండీ నుంచి దొంగిలించిన వెండి వస్తువులు, గోరంట్ల, ధర్మవరం ఐ టౌన్ పరిధిలో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు, కనగానపల్లి, సీకే పల్లి ప్రాంతాల్లో దొంగిలించిన రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పెనుకొండలో మరో నిందితుడు అరెస్ట్

మరో ఘటనలో ఈ నెల 9న పెనుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ వద్ద ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది షికారి శీన @ అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అతను అనంతపురంలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు పేర్కొన్నారు.

అతని వద్ద నుంచి పెనుకొండ, సోమందేపల్లి ప్రాంతాల్లో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించిన రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹5.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

ఈ రెండు ఘటనల్లో మొత్తం ₹15.50 లక్షల విలువైన దొంగతన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News