Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది

దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది

దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది
April 03, 2026 06:46 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దొడ్డి కొమరయ్య 99 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసు వులుబాసిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం నాడు దొడ్డి కొమరయ్య 99 వ జయంతి సందర్భంగా పండితాపురం గ్రామంలో చిత్రపటానికి మల్లి బాబు యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించి

నిజాం జాగిర్దారుల బలవంతమైన వెట్టి చాకిరి నిర్మూలన కొరకు తెలంగాణ సాధన కోసం, జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కేవలం 19 ఏళ్లకే చిన్న వయసులోనే ప్రాణాలను పణంగా పెట్టి తొలి అమరవీరుడ య్యాడని, నాడు ఆయన చూపిన త్యాగం మనందరకు స్ఫూర్తి అని, అందుకే మనం తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని, దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు మేమంతా కట్టుబడి ఉన్నామని, వారి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు, జి. రవి చింతల పెద్ద వెంకయ్య, అల్లిక బక్కయ్య, శీలం పుల్లయ్య, పాటిబండ్ల ప్రసాదు, మల్లికార్జున్ నరేష్ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News