దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది
దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది
Biksham
దొడ్డి కొమరయ్య 99 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసు వులుబాసిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
శుక్రవారం నాడు దొడ్డి కొమరయ్య 99 వ జయంతి సందర్భంగా పండితాపురం గ్రామంలో చిత్రపటానికి మల్లి బాబు యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించి
నిజాం జాగిర్దారుల బలవంతమైన వెట్టి చాకిరి నిర్మూలన కొరకు తెలంగాణ సాధన కోసం, జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కేవలం 19 ఏళ్లకే చిన్న వయసులోనే ప్రాణాలను పణంగా పెట్టి తొలి అమరవీరుడ య్యాడని, నాడు ఆయన చూపిన త్యాగం మనందరకు స్ఫూర్తి అని, అందుకే మనం తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని, దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు మేమంతా కట్టుబడి ఉన్నామని, వారి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు, జి. రవి చింతల పెద్ద వెంకయ్య, అల్లిక బక్కయ్య, శీలం పుల్లయ్య, పాటిబండ్ల ప్రసాదు, మల్లికార్జున్ నరేష్ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి