దండు మల్కాపూర్లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన
దండు మల్కాపూర్లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన
K.RAVI
గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు – చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు మహోత్సవాలు ఏప్రిల్ 4, 2026 శనివారం నుండి ఏప్రిల్ 7, 2026 మంగళవారం వరకు జరిగే కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలను ఆగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది.ఈ వేడుకలో దేవాలయ ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్, జెర్రిపోతుల అకిల మహేందర్, ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి