Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:14 AM

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన
April 04, 2026 07:19 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు – చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు మహోత్సవాలు ఏప్రిల్ 4, 2026 శనివారం నుండి ఏప్రిల్ 7, 2026 మంగళవారం వరకు జరిగే కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలను ఆగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది.ఈ వేడుకలో దేవాలయ ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్, జెర్రిపోతుల అకిల మహేందర్, ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News