Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన
April 04, 2026 07:19 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు – చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు మహోత్సవాలు ఏప్రిల్ 4, 2026 శనివారం నుండి ఏప్రిల్ 7, 2026 మంగళవారం వరకు జరిగే కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలను ఆగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది.ఈ వేడుకలో దేవాలయ ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్, జెర్రిపోతుల అకిల మహేందర్, ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News