Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” జీతాలు ఇవ్వకపోతే నీటి సరఫరా నిలిపివేత – కార్మికుల హెచ్చరిక రాఘవ్ చద్దా గది: భవిష్యత్ ప్రధాని యొక్క పుస్తకాల సామ్రాజ్యం అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 10:46 PM

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన
April 04, 2026 07:19 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు – చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు మహోత్సవాలు ఏప్రిల్ 4, 2026 శనివారం నుండి ఏప్రిల్ 7, 2026 మంగళవారం వరకు జరిగే కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలను ఆగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది.ఈ వేడుకలో దేవాలయ ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్, జెర్రిపోతుల అకిల మహేందర్, ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News