దివ్యాంగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి : నిర్మల జగ్గారెడ్డి
దివ్యాంగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి : నిర్మల జగ్గారెడ్డి
Krishna
ఆత్మస్థైర్యం, పట్టుదలతో చదువుకుని ఎంతో మంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సంజీవ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలు, చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. శారీరక ఇబ్బందులు విజయానికి అడ్డంకి కావని, పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి ప్రతిభను వెలికితీయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పురపాలక సంఘ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీతా మహేష్, యశోద, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి