Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

దివ్యాంగుల హామీలు అమలు చేయాలి. మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం

దివ్యాంగుల హామీలు అమలు చేయాలి. మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం

దివ్యాంగుల హామీలు అమలు చేయాలి.  మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం
May 20, 2026 02:32 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను కలిసి వినతిపత్రం అందజేశాయి.

దివ్యాంగులు రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యలో ప్రత్యేక సదుపాయాలు, స్వయం ఉపాధి పథకాల బలోపేతం, ఐటీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగుల సమస్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నకరకంటి అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, సభ్యులు వేణుగౌడ్, వికలాంగుల రాజ్యాధికార ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వంశరాజ్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News