దివ్యాంగుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే వేముల వీరేశం
దివ్యాంగుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
స్కూటీలు, ల్యాప్టాప్ లను దివ్యాంగ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తెలిపారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరైన స్కూటీలు మరియు ల్యాప్టాప్లను అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యే అధికారికంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి