Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ
May 20, 2026 05:31 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోందని భువనగిరి మండల విద్యాధికారి పి. నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో (ALIMCO), సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి పెన్షనర్స్ భవన్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ పెసరు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 17 మండలాల నుంచి 148 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

చౌటుప్పల్, భువనగిరి, గుండాల మండలాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే వీల్‌చైర్లు, సీపీ చైర్లు, రోలేటర్లు, వినికిడి యంత్రాలు, టీఎల్‌ఎం కిట్లు తదితర ఉపకరణాలు అందజేశారు.

కార్యక్రమంలో మోత్కూరు మండల విద్యాధికారి టి. సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్లు కిరణ్, రామచంద్రు, రవీందర్ రెడ్డి, సుధామణి, సంధ్యారాణి, సుజాత, ఆలింకో ప్రతినిధులు సోనీ కుమారి, శోభిత్ ద్వివేది, సుమీత్ రాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News