PRINT TIME: May 26, 2026 03:59 PM
జిల్లాస్థాయిలో కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినికి ప్రశంసా పత్రం
జిల్లాస్థాయిలో కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థినికి ప్రశంసా పత్రం
February 03, 2026 03:10 PM
266 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు చెందిన పదవతరగతి విద్యార్థిని టి.భవ్య జిల్లాస్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచి,రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.దుర్గయ్య తెలిపారు.విద్యార్థినికి జిల్లా విద్యాధికారి కే సత్యనారాయణ ప్రశంసా పత్రం మెమొంటో అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని అభివృద్ధికి కృషి చేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్ దేవకమ్మ, మారగోని బాబు తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి