Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు
February 19, 2026 08:36 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా,R&B, రవాణా,ఆర్టీసీ,పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిస్థితిని శాఖల వారీగా సమీక్షించారు.జిల్లా లో అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలు, ముఖ్యంగా జాతీయ రహదారులపై చోటుచేసుకున్న ప్రమాదాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాల గణాంకాలు, కారణాలపై సమగ్ర విశ్లేషణ జరపాలని ఆదేశించారు.తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను “బ్లాక్ స్పాట్స్”గా గుర్తించి, వాటిపై తక్షణమే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, రోడ్ల మరమ్మతులు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.అదనంగా, రహదారుల వెంట పెరిగిన చెట్ల కొమ్మలు, అడ్డంకులు తొలగించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఎక్కడైనా ప్రమాదం సంభవించినప్పుడు దానికి గల అసలు కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం కలిగి ఉండాలని చెప్పారు. రోడ్డు భద్రత అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News