Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:17 AM

జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లు

జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లు

జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లు
16-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ప్రత్యేక సమావేశాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు అన్ని మున్సిపాలిటీలలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించబడింది. అనంతరం కోరం నిర్ధారించిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగింది.జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. అయితే జహీరాబాద్ మరియు ఇంద్రేశం మున్సిపాలిటీలలో సరిపడా కోరం లేకపోవడంతో ఎన్నికలను ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు.


మున్సిపాలిటీ వారీగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు:


ఆందోల్–జోగిపేట్:

చైర్మన్ – సోమ్మిరెడ్డి కృష్ణారెడ్డి

వైస్ చైర్మన్ – ఆకుల సత్యనారాయణ

గడ్డపోతారం:

చైర్మన్ – గద్దె సుష్మ

వైస్ చైర్మన్ – లక్ష్మ గోని మహేందర్ గౌడ్

గుమ్మడిదల:

చైర్మన్ – చిన్న పాపాని కుమార్ గౌడ్

వైస్ చైర్మన్ – చిమ్ముల సంధ్య

ఇస్నాపూర్:

చైర్మన్ – మోతే సుమలత

వైస్ చైర్మన్ – పట్లోళ్ల మాధవి

జిన్నారం:

చైర్మన్ – నక్కిర్తి యాట జనార్ధన్

వైస్ చైర్మన్ – వంగెట్టి ప్రతాప్ రెడ్డి

కోహిర్:

చైర్మన్ – ఎం. అశోక్

వైస్ చైర్మన్ – మహమ్మద్ అబ్దుల్ హన్నన్ జావిద్

నారాయణఖేడ్:

చైర్మన్ – నగేష్ కుమార్ షట్కార్

వైస్ చైర్మన్ – దారం శంకర్

సదాశివపేట్:

చైర్‌పర్సన్ – మునిపల్లి అంజమ్మ

వైస్ చైర్మన్ – హెచ్. రేణుక

సంగారెడ్డి:

చైర్‌పర్సన్ – కూన వనిత

వైస్ చైర్మన్ – షేక్ షఫీ అహ్మద్


చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తయింది.


Sthanikam

జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లు

Article Image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ప్రత్యేక సమావేశాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు అన్ని మున్సిపాలిటీలలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించబడింది. అనంతరం కోరం నిర్ధారించిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగింది.జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. అయితే జహీరాబాద్ మరియు ఇంద్రేశం మున్సిపాలిటీలలో సరిపడా కోరం లేకపోవడంతో ఎన్నికలను ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు.


మున్సిపాలిటీ వారీగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు:


ఆందోల్–జోగిపేట్:

చైర్మన్ – సోమ్మిరెడ్డి కృష్ణారెడ్డి

వైస్ చైర్మన్ – ఆకుల సత్యనారాయణ

గడ్డపోతారం:

చైర్మన్ – గద్దె సుష్మ

వైస్ చైర్మన్ – లక్ష్మ గోని మహేందర్ గౌడ్

గుమ్మడిదల:

చైర్మన్ – చిన్న పాపాని కుమార్ గౌడ్

వైస్ చైర్మన్ – చిమ్ముల సంధ్య

ఇస్నాపూర్:

చైర్మన్ – మోతే సుమలత

వైస్ చైర్మన్ – పట్లోళ్ల మాధవి

జిన్నారం:

చైర్మన్ – నక్కిర్తి యాట జనార్ధన్

వైస్ చైర్మన్ – వంగెట్టి ప్రతాప్ రెడ్డి

కోహిర్:

చైర్మన్ – ఎం. అశోక్

వైస్ చైర్మన్ – మహమ్మద్ అబ్దుల్ హన్నన్ జావిద్

నారాయణఖేడ్:

చైర్మన్ – నగేష్ కుమార్ షట్కార్

వైస్ చైర్మన్ – దారం శంకర్

సదాశివపేట్:

చైర్‌పర్సన్ – మునిపల్లి అంజమ్మ

వైస్ చైర్మన్ – హెచ్. రేణుక

సంగారెడ్డి:

చైర్‌పర్సన్ – కూన వనిత

వైస్ చైర్మన్ – షేక్ షఫీ అహ్మద్


చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తయింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News