Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:41 AM

జిల్లాలో ఇంధనానికి కొరత లేదు కలెక్టర్ బి. చంద్రశేఖర్..

జిల్లాలో ఇంధనానికి కొరత లేదు కలెక్టర్ బి. చంద్రశేఖర్..

జిల్లాలో ఇంధనానికి కొరత లేదు కలెక్టర్ బి. చంద్రశేఖర్..
March 25, 2026 09:21 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

వదంతులు నమ్మవద్దు నిల్వలు నిండుగా ఉన్నాయి..

బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు పెడితే చర్యలు..

నల్గొండ : నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తుగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై బుధవారం ఆయన పౌరసరఫరాల అధికారులు, పెట్రోల్, గ్యాస్ డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని కలెక్టర్ ఖండించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని అనవసర భయాందోళనలతో ప్రజలు బంకుల వద్ద ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ స్టాక్ అందుబాటులో ఉంది. ఏ బంకు వద్ద కూడా 'నో స్టాక్' బోర్డులు ప్రదర్శించకూడదు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని పోలీసులతో పాటు గ్రామ పరిపాలన అధికారులు, కారోబార్లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. డీలర్లకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న మూడు నాలుగు రోజులు అత్యంత కీలకమని ఈ సమయంలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద రద్దీని నియంత్రించాలని సూచించారు.

​శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం.. ఎస్పీ

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఇంధన సరఫరా కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News