Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:05 PM

జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం

జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం

జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం
March 26, 2026 08:34 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం

- జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో బుధవారం నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన,ప్రస్తుతం వారు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సర్పంచుల వేతనాలను 6,500 నుంచి ₹25 వేల రూపాయల వరకు పెంచాలని,గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల ఫ్రీజ్‌ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా సర్పంచుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలిగా టేకు మంజుల,ప్రధాన కార్యదర్శిగా గిరికంటి నిరంజన్ గౌడ్,ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి,జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్,కార్యదర్శిగా చిన్నం బీరప్ప,ప్రచార కార్యదర్శిగా భూక్య రాజారాం నాయక్,సహాయ కార్యదర్శిగా ఒగ్గు రవళి,కోశాధికారిగా కాసులు అంజయ్యలను ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ...సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,ఫోరం రాష్ట్ర నాయకులు,జిల్లాలోని మండల ప్రాంతా గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News