జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం
జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం
Sthanikam District Staff Reporter
సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం
- జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో బుధవారం నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన,ప్రస్తుతం వారు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సర్పంచుల వేతనాలను 6,500 నుంచి ₹25 వేల రూపాయల వరకు పెంచాలని,గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల ఫ్రీజ్ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా సర్పంచుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలిగా టేకు మంజుల,ప్రధాన కార్యదర్శిగా గిరికంటి నిరంజన్ గౌడ్,ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి,జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్,కార్యదర్శిగా చిన్నం బీరప్ప,ప్రచార కార్యదర్శిగా భూక్య రాజారాం నాయక్,సహాయ కార్యదర్శిగా ఒగ్గు రవళి,కోశాధికారిగా కాసులు అంజయ్యలను ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ...సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,ఫోరం రాష్ట్ర నాయకులు,జిల్లాలోని మండల ప్రాంతా గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి