Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 09:41 PM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
March 16, 2026 08:18 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిప్రమాదాలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాదాలను నివారించే విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భద్రతా నియమాలను పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు,విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా స్పందించడం చాలా అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,సిబ్బంది మల్లికార్జున్,హరీష్ రెడ్డి, కరుణాకర్,శ్రీనివాస్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News