Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:30 PM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
16-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిప్రమాదాలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాదాలను నివారించే విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భద్రతా నియమాలను పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు,విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా స్పందించడం చాలా అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,సిబ్బంది మల్లికార్జున్,హరీష్ రెడ్డి, కరుణాకర్,శ్రీనివాస్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

Article Image

ఆలేరు:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిప్రమాదాలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాదాలను నివారించే విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భద్రతా నియమాలను పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు,విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా స్పందించడం చాలా అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,సిబ్బంది మల్లికార్జున్,హరీష్ రెడ్డి, కరుణాకర్,శ్రీనివాస్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News