Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:00 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
February 22, 2026 07:48 PM 974 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు బాల్యస్మృతులనునెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.తమకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చిన గురువులు శంకరయ్య, అంజయ్య, వెంకటముత్యాలు, రమాదేవిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నవారు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు తమ ప్రస్తుత హోదాలను పంచుకుంటూ గురువులతో ముచ్చటించారు.పూర్వ విద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రోజంతా సందడిగా గడిపారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.ఈ సందర్భంగా తమ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కక్కిరేణి భిక్షం కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం రూ.15 వేల విరాళాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో బొడిగె అంజయ్య, చెరుకు మధుసూధన్, ఫైళ్ల రవి, గోపగోని లింగస్వామి, అంతటి అశోక్, చిట్టిపోలు రాజశేఖర్, మిద్దెల రామ్మోహన్, నమ్ముల రవి, బొల్లోజు ధనుంజయ, గోపగోని శ్రీనివాస్, పంతంగి మధనాచారి, కంకల నర్సింహ, బండ శేఖర్, ఆకుల వసంత, బొడిగె పద్మ, శోభ, అశోక్ రామ్, ప్రసన్న, వెంకట్ రెడ్డి, మధుసూదన్, సైదులు, విజయ్ కుమార్, కిరణ్, శ్రీధర్, ప్రదీప్, మజ్జు, ఉస్మాన్, ఫాతీమా, గణేష్, రమేష్, లింగస్వామి, లక్ష్మీదేవమ్మ, జయసుధ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News