PRINT TIME: May 12, 2026 05:23 PM
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఆర్వో
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఆర్వో
May 12, 2026 03:15 PM
48 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారి (DRO)గా కొండయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీఆర్వో కొండయ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఆర్వోకు పలువురు రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి