- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ
భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి