దిల్సుఖ్నగర్,: సిటీ డిపోలో కార్గో, పార్సెల్ రవాణాలో వచ్చిన కానీ వినియోగదారులు తీసుకెళ్లని పార్సెల్స్ను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సమత తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా సంబంధిత వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 24 నుంచి 25 వరకు వచ్చిన పార్సెల్స్ను ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్సెల్ షిప్మెంట్ విలువపై 50 శాతం ధరకు వేలం జరగనుంది.
ఇతర వివరాలకు 9154298792 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి