Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 AM

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి
May 18, 2026 05:21 PM 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తే విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాల’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విశ్వవిద్యాలయం రూపొందించిన ‘ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ (ఐడీపీ)’ అమలు ద్వారా సమగ్ర డిజిటల్‌ విద్యాసంస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఐదో దశాబ్దంలోకి అడుగుపెట్టిన విశ్వవిద్యాలయానికి ఇది ‘పరివర్తన దశాబ్దం’గా నిలుస్తుందని తెలిపారు.

సాంప్రదాయ విద్యతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్థిని కేంద్రబిందువుగా చేసుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అకడమిక్‌ వ్యవహారాలు, విద్యార్థి సేవలు, పరిపాలన, సాంకేతిక సేవలు, స్కిల్‌ డెవలప్మెంట్‌ అనే ఐదు కీలక విభాగాల సమన్వయంతో కార్యాచరణ కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ‘సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాళిక (2026–2036)’ను విడుదల చేశారు. అలాగే ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీఈటీ)’ గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా. యల్‌. విజయకృష్ణారెడ్డి, ఓఎస్‌డీ ప్రొ. రవీంద్రనాథ్‌ సోలమన్‌, డైరెక్టర్లు, డీన్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News