Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:37 PM

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి
May 18, 2026 05:21 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తే విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాల’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విశ్వవిద్యాలయం రూపొందించిన ‘ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ (ఐడీపీ)’ అమలు ద్వారా సమగ్ర డిజిటల్‌ విద్యాసంస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఐదో దశాబ్దంలోకి అడుగుపెట్టిన విశ్వవిద్యాలయానికి ఇది ‘పరివర్తన దశాబ్దం’గా నిలుస్తుందని తెలిపారు.

సాంప్రదాయ విద్యతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్థిని కేంద్రబిందువుగా చేసుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అకడమిక్‌ వ్యవహారాలు, విద్యార్థి సేవలు, పరిపాలన, సాంకేతిక సేవలు, స్కిల్‌ డెవలప్మెంట్‌ అనే ఐదు కీలక విభాగాల సమన్వయంతో కార్యాచరణ కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ‘సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాళిక (2026–2036)’ను విడుదల చేశారు. అలాగే ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీఈటీ)’ గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా. యల్‌. విజయకృష్ణారెడ్డి, ఓఎస్‌డీ ప్రొ. రవీంద్రనాథ్‌ సోలమన్‌, డైరెక్టర్లు, డీన్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News