Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:39 AM

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన
21-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

- అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా కార్యక్రమం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం అవగాహన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డి మార్ట్ ఉద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ వాహనదారులకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, విధుల నిర్వహణ కోసం ప్రయాణించే సిబ్బంది జాగ్రత్తగా గమ్యానికి చేరుకోవాలని, రోడ్డు దాటే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబానికి అండ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించగా, వేగంగా వాహనాలు నడపమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, మహేందర్, మహిళా ఎస్సై నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

Article Image

- అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా కార్యక్రమం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం అవగాహన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డి మార్ట్ ఉద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ వాహనదారులకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, విధుల నిర్వహణ కోసం ప్రయాణించే సిబ్బంది జాగ్రత్తగా గమ్యానికి చేరుకోవాలని, రోడ్డు దాటే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబానికి అండ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించగా, వేగంగా వాహనాలు నడపమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, మహేందర్, మహిళా ఎస్సై నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News