డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన
డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన
Vikram
- అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా కార్యక్రమం
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం అవగాహన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డి మార్ట్ ఉద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ వాహనదారులకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, విధుల నిర్వహణ కోసం ప్రయాణించే సిబ్బంది జాగ్రత్తగా గమ్యానికి చేరుకోవాలని, రోడ్డు దాటే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబానికి అండ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించగా, వేగంగా వాహనాలు నడపమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, మహేందర్, మహిళా ఎస్సై నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి