Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:12 AM

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన
January 21, 2026 06:43 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

- అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా కార్యక్రమం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం అవగాహన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డి మార్ట్ ఉద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ వాహనదారులకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, విధుల నిర్వహణ కోసం ప్రయాణించే సిబ్బంది జాగ్రత్తగా గమ్యానికి చేరుకోవాలని, రోడ్డు దాటే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబానికి అండ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించగా, వేగంగా వాహనాలు నడపమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, మహేందర్, మహిళా ఎస్సై నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News